అఘోరీ ఆడనా.. మగనా.. ఏ బ్యారెక్ లో పెట్టాలి : తిప్పి పంపిన సంగారెడ్డి జైలు అధికారులు

అఘోరీ ఆడనా.. మగనా.. ఏ బ్యారెక్ లో పెట్టాలి : తిప్పి పంపిన సంగారెడ్డి జైలు అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి  చేవెళ్ల కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్​ విధించారు.  జైలు అధికారులు అఘోరి శ్రీనివాస్​ కు షాక్​ ఇచ్చారు.  అఘోరి ట్రాన్స్​ జండర్​ అయినందున లింగ నిర్దారణ కాకుండా ఏ బ్యారక్​ లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్​ జైలు అధికారులు తిప్పి పంపారు.  న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు జరిపి అఘోరి శ్రీనివాస్​ కు లింగ నిర్దారణ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. 

ఇదిలా ఉంటే అఘోరీ శ్రీనివాస్​ ను సంగారెడ్డి ​ జైలుకు తరలించగా  అరుపులు.. కేకలతో  అక్కడ హంగామా సృష్టించాడు.  తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలని అఘోరి పట్టుబట్డాడు. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీకి చేవెళ్ల కోర్టు  రిమాండ్​  విధించింది.  అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి లింగా నిర్దారణ విషయంలో  ట్రాన్స్​ జండర్​ ఫిమేల్​ వైద్యులు ధృవీకరించారు. 

Also Read:-ఎట్టకేలకు అఘోరీ అరెస్టు.. యూపీ నుంచి నార్సింగి స్టేషన్కు.. అఘోరీ వెంటే వర్షిణి

దీంతో సంగారెడ్డి జైలు అధికారులు అఘోరీ శ్రీనివాస్​ అనుమతి నిరాకరించారు.  మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి మొకిల పోలీసులు తరలించారు.  వైద్యుల నివేదిక ఆధారంగా అఘోరి ఏ జైలుకు తరలించాలో పోలీసులు నిర్ణయం తీసుకుంటారు,  చంచల్​ గూడ జైలులో ట్రాన్స్​ జండర్లకు ప్రతత్యేక బ్లాక్​ ఉండటంతో...  అఘోరి శ్రీనివాస్​ ను చంచల్​గూడకు తరలించే అవకాశం ఉంది.