
- 3,100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై ఎంఓయూ
- అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు
- డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో అగ్రిమెంట్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడింది. రాజస్థాన్ తో 3,100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం జరిగింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. తెలంగాణ సర్కార్ రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది.
1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, రాజస్థాన్లో 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో సింగరేణి ఆర్థిక పరిపుష్టికి అతి పెద్ద అవకాశం లభించనుంది. మొత్తం వ్యయం, లాభాల్లో 74 శాతం సింగరేణి, 26 శాతం రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ కు వాటా ఇవ్వనుంది.
తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణికి గుర్తింపు లభించింది. డిప్యూటీ సీఎం భట్టి వెంట ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ ఉన్నారు.