8వేల ఎకరాల్లో పంటనష్టం.. వడగండ్ల వానపై వ్యవసాయ శాఖ నివేదిక.

8వేల ఎకరాల్లో పంటనష్టం.. వడగండ్ల వానపై వ్యవసాయ శాఖ నివేదిక.
  • త్వరలో పరిహారం చెల్లింపునకు చర్యలు
  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల  

హైదరాబాద్:  రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు కురిసిన చెదురు మదురు వానలు, వడగండ్ల వర్షాలు, ఈదురు గాలులకు 8,408 ఎకరాలలో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు రైతు వారీగా అధికారులు తయారుచేసిన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. 

రైతు వారీ సర్వేకు ప్రభుత్వం ఆదేశించడంతో డిటెయిల్డ్  సర్వేలో అది  8,408  అని తేలింది. ఈ మేరకు  నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించేందుకు సిద్ధమవుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.