‘అర్థమైందా అరుణ్ కుమార్’ సెకండ్ సీజన్ వచ్చేస్తోంది

‘అర్థమైందా అరుణ్ కుమార్’ సెకండ్ సీజన్ వచ్చేస్తోంది

‘అర్థమైందా అరుణ్ కుమార్’  వెబ్ సిరీస్‍ రెండో సీజన్ రెడీ అవుతోంది.  గతేడాది ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌‌కు మంచి రెస్పాన్స్‌‌ రావడంతో సెకండ్ సీజన్‌‌ను రూపొందించారు. ఆదిత్య కేవీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌‌లో  అరుణ్ కుమార్ పాత్రలో సిద్ధు పవన్ నటించగా, తేజస్వి మదివాడ,  అనన్య శర్మ, రాశి సింగ్ ఇందులో నటించారు.  అక్టోబర్ 31 నుంచి ఆహాలో  స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ సీజన్‌‌లో  పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన  అబ్బాయి కార్పొరేట్ ఆఫీస్‌‌లో పడే తిప్పలను ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా చూపిస్తే.. సెకండ్ సీజన్‌‌లో తను  జాబ్‌‌లో ఎలా పైకొచ్చాడు, అమ్మాయిలను ఎలా ఫేస్ చేస్తాడని ఇంటరెస్టింగ్‌‌గా చూపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. తేజస్వి గ్లామర్‌‌‌‌ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తుంటే,  రాశి సింగ్ మోడర్న్‌‌గా కనిపిస్తుంది. ‘అమలాపురం కుర్రాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రేపు మీరే చూస్తారు’ అని పవన్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని పెంచింది.  అజయ్ అరసాడ అందించిన సంగీతం ఆకట్టుకుంది.