NTR, Sandeep Reddy Vanga: ఎన్టీఆర్తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మీటింగ్..కాంబో కుదిరనట్టేనా?: క్లారిటీ

NTR, Sandeep Reddy Vanga: ఎన్టీఆర్తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా  మీటింగ్..కాంబో కుదిరనట్టేనా?: క్లారిటీ

దేవర మూవీ ట్రైలర్ మంగళవారం సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ గ్రాండ్ లాంచ్‌కు ముందు ఎన్టీఆర్(NTR),టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా ముంబైలో కలుసుకున్నారు. అయితే, ప్రస్తుతం వీరి కలయిక ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. యానిమల్ లాంటి వైల్డ్ హిట్ తో ఇండస్ట్రీ సెన్సేషన్ డైరెక్టర్ గా పేరొందిన సందీప్ రెడ్డి త్వరలో ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నాడా? అనే ఊహలు మొదలయ్యాయి. ఈ మేరకు వీరి కలయికకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

తాజా సమాచారం ప్రకారం..ఎన్టీఆర్,స్టైలిష్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముంబైలో కలుసుకున్నారు. అయితే..ఇది ముంబైలో జరిగిన సాధారణ సమావేశమని, అక్కడ వీరిద్దరూ తమ నుంచి రాబోయే సినిమా విశేషాలు పంచుకున్నట్లు సమాచారం. దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదల అవుతుండటంతో చూడటానికి ఎదురుచూస్తున్నట్లు వంగా చెప్పినట్లు సమాచారం. వాళ్లిద్దరికీ..ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. సంథింగ్ స్పెషల్ స్టోరీతో ఫ్యూచర్ లో భారీ సినిమా చేసే అవకాశం ఉందని' సినీ వర్గాల సమాచారం. అదే కనుక నిజమైతే ఎన్టీఆర్ నుంచి విశ్వరూపం చూసేయొచ్చు అన్నమాట!

Also Read:-తెలుగులో మరో బంప‌రాఫ‌ర్‌ కొట్టేసిన బ్యూటిఫుల్ భాగ్య‌శ్రీ బోర్సే..

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మరియు యానిమల్ చిత్రాల విజయం తర్వాత..డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇండియన్ సినిమా స్టార్ దర్శకుల్లో ఒకరిగా మారారు. అతను ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు మరియు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సీక్వెల్ గా 'యానిమల్ పార్క్' ను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

ఎన్టీఆర్ దేవర తర్వాత హిందీ హీరో హృతిక్ రోషన్ 'వార్ 2'లో నటిస్తున్నారు. ఆ తర్వాత 'కెజిఎఫ్', 'సలార్' సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేయనున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక అప్పటిలోపు సందీప్ స్పిరిట్, యానిమల్ స్పార్క్ ముగించే పనిలో ఉంటాడు. ఏదేమైనా ఆడియన్స్ ఎప్పట్నుంచో ఈ కాంబోపై భారీ ఆశలు పెట్టుకున్నారు.