- యువత భవిష్యత్తును మోదీ నాశనం చేశారు: ఖర్గే
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం కంటే పెద్ద సమస్య మరొకటి లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యువత భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటాను ఉటంకిస్తూ.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వ డేటా యువత నిస్సహాయతను దాచలేకపోయిందని ట్వీట్ చేశారు.
‘‘2023–-24లో యువత నిరుద్యోగం 10.2% భయంకర స్థాయికి చేరుకోలేదా? కలర్ఫుల్ నినాదాలు ఇవ్వడం, ఫొటోలు దిగడం తప్ప యువతకు ఉద్యోగాలు కల్పించడానికి మోదీ ఏం చేశారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
రెగ్యులర్ జీతాలతో ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య ఏడేండ్లలో అత్యల్పంగా 15.9 శాతానికి చేరిందనేది నిజం కాదా అని ఖర్గే నిలదీశారు.