
హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో ఎంఐఎంకు 63, బీజేపీ25 ఓట్లు పోలయ్యాయి. క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న బీజీపీకి నిరాశే ఎదురయ్యింది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏప్రిల్ 25న శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేశారు.. మొత్తం ఓటర్లు 112 మంది ఉన్నప్పటికీ 88 ఓట్లు మాత్రమే పోల్అయ్యాయి. లెక్కింపు మొదలైన అరగంట నుంచి గంట లోపే రిజల్ట్వెల్లడయ్యింది.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. రెండు పార్టీలు పోటీ చేయలేదు. కాంగ్రెస్ ఎంఐఎంకు సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉంది.