గాలివాన బీభత్సం, 400 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

గాలివాన బీభత్సం, 400 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో బుధవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పాలేరు, రాజుపేట, గురువాయిగూడెం, ఈశ్వర మాదారం, నర్సింహులగూ డెం తదితర గ్రామాల్లో గాలి, వాన రావడంతో 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొట్ట దశలో ఉన్న వరికి పూర్తిగా దెబ్బతినడంతో పెద్దమొత్తంలో నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.