హైదరాబాద్​ లో ఎయిర్​ హోస్టెస్​కు చేదు అనుభవం

హైదరాబాద్​ లో  ఎయిర్​ హోస్టెస్​కు చేదు అనుభవం

పంజాగుట్ట, వెలుగు: సిటీలో ఎయిర్​హోస్టెస్ కు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు తెలిపిన  ప్రకారం.. ​కేరళకు చెందిన యువతి  ఎయిర్ ​ఇండియాలో ఎయిర్​హోస్టెస్. ఈనెల 23న సిటీకి వచ్చి, అమీర్​పేట్​ గ్రీన్​పార్క్​హోటల్లో బస చేసింది. 25న రాత్రి 11 గంటలకు హాటల్​కు చెందిన  తులిప్ ​రెస్టారెంట్​లో డిన్నర్ చేసి, హోటల్​కు చేరుకుంది.  అదే రెస్టారెంట్​లో డిన్నర్​ చేసిన ఓ వ్యక్తి ఆమె వెనకాలే హోటల్​వద్దకు వెళ్లాడు.  ఆమె రూమ్ డోర్ బెల్ మోగించాడు.  ఏదో అలికిడి కావడంతో వెళ్లిపోయాడు.  బాధితురాలు  సెక్యూరిటీ మేనేజర్ వినోద్ కు చెప్పడంతో  ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సీసీ ఫుటేజీ పరిశీలించి, నిందితుడిని ఉప్పల్ కు చెందిన రాజశేఖర్​గా గుర్తించి కేసు నమోదు చేశారు.