
ప్రపంచ దేశాల్లో వాయు కాలుష్యంపై అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపీఐసీ) ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్ఐ)ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కలుషిత మహా నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ఢిల్లీ నగరంలోని గాలిలో అత్యంత కాలుష్య కారకాలైన సూక్ష్మ ధూళి కణాలైన పీఎం – 2.5 ప్రతి క్యూబిక్ మీటర్లో సగటున 107 మైక్రోగ్రాములకు మించి ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
ఇది డబ్ల్యూహెచ్ఓ నిర్దేశిత ప్రమాణాల కంటే ఏకంగా 21 రెట్లు ఎక్కువ. గాలిలో పీఎం – 2.5 క్యూబిక్ మీటర్కు 5 మైక్రో గ్రాములకు మించొద్దని డబ్ల్యూహెచ్ఓ గత ఏడాది స్పష్టం చేసింది. 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యంలో 44శాతం వాటా భారత్దేనని తెలిపింది. దేశంలో 40శాతం అత్యంత కాలుష్యభరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాలుష్యం ఇలాగే కొనసాగితే ఉత్తర భారతంలో 50 కోట్ల ప్రజల ఆయుర్ధాయం 7.6 ఏళ్లు తగ్గుతుందని చెప్పింది.