తిరుమల శ్రీవారి ఆలయంపై రెండు రోజులుగా ఓ విమానం చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుమల గగనతలంలో విమాన రాకపోకలపై నిషేధం ఉంది. అయినా రెండ్రోజులుగా విమానం శ్రీవారి ఆలయంపైకి అతి దగ్గరగా చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఆలయానికి సమీపంలో విమానం తిరగడం ఆగమ విరుద్దమంటున్నారు పండితులు.
తిరుమలను నో ప్లై జోన్గా ప్రకటించాలని TTD చేస్తున్న విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు.