బంగారాన్ని ఇలా కూడా తరలిస్తారా..? ఇతని ప్లాన్కు ఎయిర్పోర్ట్ అధికారులు షాక్

బంగారాన్ని ఇలా కూడా తరలిస్తారా..? ఇతని ప్లాన్కు ఎయిర్పోర్ట్ అధికారులు షాక్

న్యూఢిల్లీ:  బంగారాన్ని తరలించేందుకు విచిత్రమైన ప్లాన్లు వేస్తుంటారు కొందరు స్మగ్లర్లు. తాజాగా ఖర్జూర పండ్లలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్​అధికారులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

56 ఏండ్ల వయస్సు ఉన్న ప్రయాణికుడు  జెడ్డా నుంచి ఢిల్లీకి ఎస్వీ 756 విమానంలో వ‌చ్చాడు.  చెకింగ్ టైంలో అత‌ని ల‌గేజీపై అనుమానం రాగా.. పండ్లు ఉన్న మూట‌ను ఓపెన్ చేసి ప‌రిశీలించారు. అయితే ఆ పండ్లలో బంగారు ముక్కల‌ను అమ‌ర్చిన‌ట్లు కస్టమ్స్​ఆఫీసర్లు గుర్తించారు. 

అత‌ని వ‌ద్ద నుంచి సుమారు 172 గ్రాముల బంగార‌న్ని స్వాధీనం చేసుకున్నారు.  అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.