
హైదరాబాద్, వెలుగు: తమ కస్టమర్లకు ఇక నుంచి తెలుగు సహా తొమ్మిది ప్రాంతీయ భాషల్లో స్పామ్కాల్స్హెచ్చరికలు పంపిస్తామని టెలికం ఆపరేటర్ఎయిర్టెల్తెలిపింది. ఇదివరకే ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ టూల్ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ఇది 27.5 బిలియన్లకు పైగా కాల్స్ను స్పామ్ గా గుర్తించింది. స్పామర్ల కంటే ముందుండాలనే లక్ష్యంతో ఈ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు ఎయిర్టెల్తెలిపింది.
ఏఐ ఆధారిత టూల్ ఇప్పుడు అంతర్జాతీయ నెట్ వర్క్ ల నుంచి వచ్చే అన్ని స్పామ్ కాల్స్ను, ఎస్ఎంఎస్ లను పరిశీలించి కస్టమర్లను అప్రమత్తం చేస్తుంది. మోసగాళ్లు, స్పామర్లు మోసపూరిత కాల్స్ ను భారత్ లోకి పంపేందుకు విదేశీ నెట్ వర్క్ లను ఉపయోగించుకోవడంతో గత ఆరు నెలల్లో విదేశీ స్పామ్ కాల్స్ 12శాతం పెరిగాయి. ఈ కొత్త ఫీచర్తో ఇలాంటి కాల్స్ను అడ్డుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది.