
హైదరాబాద్, వెలుగు: భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ టీచర్ల కోసం డెవెలప్చేసిన ఉచిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ టీచర్ యాప్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. టీచర్లు నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త బోధన పద్ధతుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడానికి అవసరమైన అన్ని రకాల వనరులను అందిస్తుందని ఎయిర్టెల్ తెలిపింది.ఇందులో 76 కోర్సులు ఉంటాయి.