సింగరేణి బిడ్​లో పాల్గొనేలా ఆదేశించండి.. గుర్తింపు సంఘం లీడర్ల విజ్ఞప్తి

సింగరేణి బిడ్​లో పాల్గొనేలా ఆదేశించండి.. గుర్తింపు సంఘం లీడర్ల విజ్ఞప్తి

కోల్​బెల్ట్, వెలుగు: బొగ్గు బ్లాక్​లను దక్కించుకోవడానికి వేలం​లో పాల్గొనేలా సింగరేణి యాజమాన్యాన్ని  ఆదేశించాలని సింగరేణి గుర్తింపు కార్మిక  సంఘం ఏఐటీయూసీ లీడర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​(ఏఐటీయూసీ) స్టేట్  గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్​ సెక్రటరీ రాజ్​కుమార్​ నేతృత్వంలో యూనియన్​ బృందం భట్టిని కలిసింది.

సింగరేణికి చెందిన పలు అంశాలపై వారు చర్చించారు. సింగరేణిలో  బొగ్గు ఉత్పత్తి పెరుగుదలకు, నూతన ఉపాధుల కోసం కొత్త గనులను తవ్వాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం సింగరేణి సంస్థ వేలంలో పాల్గొని కొత్త  బ్లాక్​లను దక్కించుకోవాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 149 మంది జూనియర్​  అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.