
- ఏఐటీయూసీ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య
- బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ 5న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు రాకపోతే కంపెనీ మనుగడ కష్టమని, ఉద్యోగ భద్రతకు, కొత్త ఉపాధులకు నష్టం వాటిల్లుతుందని సింగరేణి గుర్తింపు సంఘం(ఏఐటీయూసీ) స్టేట్ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం మందమర్రి ఏరియా కాసిపేట-1 గనిపై నిర్వహించిన గేట్మీటింగ్, మందమర్రిలోని యూనియన్ఆఫీస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటీకరణను సమష్టిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితాలో చేర్చడంతో సింగరేణికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్సర్కార్.. కేంద్రం ప్రభుత్వంతో చర్చించి తెలంగాణలోని అన్ని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఈనెల 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
సమావేశాల్లో ఏఐటీయూసీ సెంట్రల్సెక్రటరీ ఎండీ అక్బర్ అలీ, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్బ్రాంచీల సెక్రటరీలు సలెంద్ర సత్యానారాయణ, దాగం మల్లేశ్, ఎ.ఆంజనేయులు, వైస్ప్రెసిడెంట్లు భీమనాథుని సుదర్శనం, లింగయ్య, వెంకటస్వామి, అసిస్టెంట్సెక్రటరీలు, గనుల పిట్, ఏరియా బాధ్యులు పాల్గొన్నారు.