జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : శ్రీనివాస్ రెడ్డి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి :  శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాల జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, పక్కాగృహాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం హైదరాబాద్​లో రాష్ట్ర  ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రాంతాల్లో 1/70 చట్టం అమల్లో ఉన్నందున జర్నలిస్టులకు ఇంటి స్థలాలను అందించడం లేదని, సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గందసిరి రవి పాల్లొన్నారు.