
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ2 : తాండవం’. నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే హైదరాబాద్లో ఓ షెడ్యూల్, కుంభమేళాలో మరో షెడ్యూల్ను పూర్తి చేయగా, హిమాలయాల్లోనూ కొన్ని కొన్ని ఎక్స్ట్రార్డినరీ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ను రెడీ చేస్తున్నారట.
ఈ సెట్లో రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్లను షూట్ చేస్తారు. స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఈ ఫైట్స్ను కంపోజ్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ సీన్స్ మూవీలో హైలైట్గా ఉంటాయట. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.