అక్షయతృతీయ రోజు(ఏప్రిల్​ 30) ఏరాశి వారు ఏ పూజ చేయాలి.. ఏ వస్తువు దానం చేయాలి..

అక్షయతృతీయ రోజు(ఏప్రిల్​ 30)   ఏరాశి వారు ఏ పూజ చేయాలి.. ఏ వస్తువు దానం చేయాలి..

అక్షయ తృతీయ రోజున చేసే పూజలు .. దాన ధర్మాలు ఎంతో ఫలితాన్ని ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  ఆరోజు లక్ష్మీనారాయణులను.. సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు.  ఈ పూజతో కొన్ని పరిహారాలు చేస్తే జాతకరీత్యా దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఏ రాశి వారు ఏ పూజ చేయాలి.. ఏ వస్తువు దానం చేయాలో తెలుసుకుందాం. .  .

తెలుగు వారి కొత్త సంవవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తుంది.  మరో కొద్ది రోజుల్లో చైత్రమాసం పూర్తయి.. వైశాఖ మాసం వస్తుంది.  హిందూ పురాణాల ప్రకారం.. వైశాఖ మాసం శుక్లం తదియ రోజున  అక్షయ తృతీయ  ఈ ఏడాది (2025) ఏప్రిల్​ 30 వ తేదీన   జరుపుకుంటారు. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజని.. ఈరోజు ఏవస్తువు కొన్నా అక్షయపాత్ర మాదిరిగా దినదినాభివృద్ది చెందుతుని పండితులు చెబుతున్నారు.

 మేషరాశి: ఈ రాశి వారు తులసి మొక్క దగ్గర లక్ష్మీ నారాయణులకు ఆవాహన చేసి... లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించి.. సంధ్యా సమయంలో ( సూర్యాస్తమయం) ఆవునెయ్యుతో దీపం దీపం వెలిగించాలి.  అక్షయ తృతీయ రోజున  ఉదయం .. దగ్గరలోని దేవాలయానికి వెళ్లి దేవాలయ పూజారికి గోధుమలను దానం చేయాలి.  గోమాతకు తోటకూరను ఆహారం ఇవ్వాలి. 

వృషభ రాశి:  ఈ రాశి వారు విష్ణుమూర్తిని పూజించి..  విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి.  నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి.. ఆ తరువాత ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేయాలి.  ఈ రాశి వారు పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను దానం చేయాలి. 

మిథున రాశి: ఈ రాశి వారు వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించాలి.   గోవిందనామాలు పఠించి.. పెసలు దానం చేస్తే ఆర్దిక సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి:   ఈ రాశి వారు అమ్మవారి ఆలయాన్ని దర్శించి.. దుర్గాదేవి స్త్రోత్రాన్ని పఠించాలి.. కొత్త కుండతో అన్నం వండి.. పేదలకు దానం చేయాలి.. వీటితో  కందిపప్పు .. బెల్లం కూడా దానం చేయాలి..  గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టాలి. 

సింహరాశి: ఈ రాశి వారు ఉదయం  రుద్రాభిషేకం చేయాలి. సాయంత్రం లలిత సహస్రనామం పఠించాలి.. లేదా శ్రద్దగా వినాలి.  పేదలకు నల్ల గొడుగును దానం చేయాలని పండితులు చెబుతున్నారు. 

కన్య రాశి: ఈ రాశి వారు ఉదయం.. సాయంత్రం తులసి చెట్టుదగ్గర దీపం వెలిగించాలి.  దుర్గాదేవిని పూజించాలి.  పేదలకు పాయసాన్ని దానం చేయాలి. 

తులా రాశి: ఈ రాశి వారు హనుమంతుడికి ఆకుపూజ చేసి వడమాల సమర్పించాలి.  హనుమాన్​ చాలీసా 11 సార్లు పారాయణం చేసి ..పేదలకు చెప్పులు.. బూట్లు దానం చేయాలి.  గోమాతకు గోధుమలు.. తవుడు కలిపి ఆహారంగా పెట్టాలి. 

వృశ్చిక రాశి:  ఈ రాశి వారు కుబేరుడిని పూజించాలి.  శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.  గోమాతకు అరటి పండ్లను పెట్టాలి.  అలాగే బ్రాహ్మణులకు అరటిపండ్లు.. శక్తి కొలది దక్షిణ .. తాంబూలం ఇవ్వాలి. 

ధనస్సు రాశి: అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నారాయణులను విధిగా పూజించాలి.  పెసరపప్పుతోచేసినపులగాన్ని గోమాతకు నైవేద్యంగా సమర్పించి.. ఆహారం ఇవ్వాలి.  బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.  

మకరరాశి: ఈ రాశి వారు శివాలయాన్ని సందర్శించి.. కొబ్బరినీళ్లతో అభిషేకం చేయాలి.  బిల్వదళాలతో పరమేశ్వరుడిని పూజించాలి.  ముత్తయిదువుకు భోజనం పెట్టి  అలంకార సామాగ్రి ( చీర, జాకెట్​, గాజులు, పసుపు, కుంకుమ, గంధం) ఇవ్వాలి.   ఆ తరువాత కొత్త కుండలో నీటిని నింపి దానం ఇవ్వాలి. 

కుంభరాశి : ఈరాశివారు ఆంజనేయస్వామి వారికి తమలపాకుల దండ వేయాలి.. స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. బ్రాహ్మణులకు బెల్లం దానం చేయాలి.  గోమాతకు తోటకూరను ఆహారంగా పెట్టాలి. 

మీన రాశి: ఈ రాశి వారు రావి చెట్టు కింద దీపారాధన చేయాలి.  శివాలయంలో స్వామిని దర్శించి  బెల్లం.. ఉప్పు.. పప్పు దానం చేయాలి. 

అక్షయతృతీయ  రోజున ఈ ప్రత్యేక పరిహారాలు పాటిస్తే.. జీవితంలో ఆనందం,శాంతి, శ్రేయస్సు, కుటుంబ సామరస్యం పెరుగుతాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. అక్షయ తృతీయ రోజున జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మన రాశి ప్రకారం తీసుకునే చర్యలు ముఖ్యంగా ఫలవంతమైనవని చెబుతున్నారు. ఇవి జీవితంలో ఆర్థిక , మానసిక శాంతిని తీసుకురావడంలో సహాయపడతాయి.

►ALSO READ | OTT Movies : ఈ వారం (ఏప్రిల్ 20 నుంచి 27) ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే..స్ట్రీమింగ్ ఎక్కడంటే?