మళ్లీ ఫోన్ల వ్యాపారంలోకి ఆల్కాటె​ల్​

మళ్లీ ఫోన్ల వ్యాపారంలోకి ఆల్కాటె​ల్​

న్యూఢిల్లీ:  ఫ్రెంచ్ టెక్నాలజీ బ్రాండ్ ఆల్కాటెల్​ఫోన్లను మళ్లీ ఇండియా మార్కెట్లోకి తీసుకొస్తామని దీనిని ఆపరేట్​ చేస్తున్న నెక్స్ట్​టెల్ ​ప్రకటించింది. ఇందుకోసం 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 260 కోట్లు) కేటాయించిందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్​ తెలిపారు.  నోకియా నుంచి ట్రేడ్‌‌మార్క్ లైసెన్స్ ఒప్పందం కింద చైనీస్ సంస్థ టీసీఎల్​కమ్యూనికేషన్ ద్వారా ఆల్కాటెల్ వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్ ​ప్లాన్ల తయారీ, సప్లై చెయిన్​డెవెలప్​మెంట్​వంటి పనుల్లో ఉన్నామని ఆల్కాటెల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అతుల్ వివేక్ తెలిపారు.

ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్​వస్తువులు తయారు చేసే ఆలోచనలూ ఉన్నాయని వెల్లడించారు.  ప్రతి నిర్ణయమూ మార్కెట్ నుంచి వచ్చే స్పందనపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.  రూ. 20వేలు–-రూ. 25వేల ధరల విభాగంలో ఫోన్లు అమ్మే ప్రపోజల్స్​ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.     ఈ ఏడాది మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో స్మార్ట్‌‌ఫోన్లలో  విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.