SBI News: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు బంద్, పూర్తి వివరాలు..

SBI News: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు బంద్, పూర్తి వివరాలు..

SBI Digital Banking: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక అప్ డేట్ ప్రకటించింది. దీని కింద నేడు మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది. వార్షిక క్లోజింగ్ యాక్టివిటీ కారణంగా సేవల్లో అంతరాయం కలిగిస్తున్నందుకు చింతిస్తున్నట్లు కస్టమర్లకు మెసేజ్ ద్వారా ముందుగానే వెల్లడించింది. 

భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 1 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంటే దాదాపు 3 గంటల పాటు కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యోనో బినినెస్ వెబ్ అండ్ యాప్, యోనో, యూపీఐ సేవలు అందుబాటులో ఉండబోవని తన అధికారిక వెబ్ సైట్లో కూడా బ్యాంక్ వెల్లడించింది. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ యూపీ లైట్, ఏటీఎం వంటి పద్ధతుల్లో తమ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ వెల్లడించింది. 

Also Raed  :నేటి నుంచి మారిన యూపీఐ, మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఇవే..

 

అలాగే ఈ మూడు గంటల సమయంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్ల పనితీరు కూడా ప్రభావితం అయ్యే అకవాశం ఉందని వెల్లడించింది. అలాగే యూపీఐ లైట్ విషయానికి వస్తే ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్ మెుబైల్ నంబర్ రూల్స్ మారుతున్నందున కొంద మంది అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.