రూ.90 కోట్లు పెట్టి తీసిన అలియా భట్ సినిమా ఇప్పటివరకూ ఎంత కలెక్ట్ చేసిందంటే.?

రూ.90 కోట్లు పెట్టి తీసిన అలియా భట్ సినిమా ఇప్పటివరకూ ఎంత కలెక్ట్ చేసిందంటే.?

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అలియా భట్ మెయిన్ లీడ్ పాత్రలో నటించిన జిగ్ర సినిమా అక్టోబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాని హిందీ ప్రముఖ డైరెక్టర్ వాసన్ బాల యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. కాగా ఈ సినిమాని హిందీతోపాటూ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్ తదితరులు హాజరయ్యి ప్రమోట్ చేశారు.

అయితే ఈ సినిమా ని దాదాపుగా రూ. 90 కోట్లు బడ్జెట్ తో తీశారు. అయితే ట్రైలర్ తో ఆకట్టుకన్న జిగ్ర థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో రిలీజ్ డే నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ ప్రభావం కలెక్షన్లపై పడింది. దీంతో బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకూ రూ.52 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే రోజురోజుకీ కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. 

దీంతో జిగ్ర సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో నవంబర్ లేదా డిశెంబర్ నెలల్ జిగ్ర  సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.