కలెక్టరేట్​ ఎదుట అఖిలపక్ష ధర్నా

కలెక్టరేట్​ ఎదుట అఖిలపక్ష ధర్నా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఆరు పంచాయతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్​ ఎదుట సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి నుంచి కలెక్టరేట్​ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ అన్యాయంగా జీతాల్లో కోత విధిస్తూ కార్మికులను అధికారులు మోసం చేస్తున్నారన్నారు. 

కార్మికుల సంక్షేమాన్ని ఆఫీసర్లు విస్మరించారన్నారు. గత పది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ ప్రోగ్రాంలో సీపీఎం, సీపీఐ, బీఆర్​ఎస్​ నేతలు భూక్యా రమేష్​, లగడపాటి రమేశ్​​ అన్వర్​, ఆదివాసీ సంఘాల జాయింట్​ యాక్షన్​ కమిటీ కన్వీనర్ వాసం రామకృష్ణ పాల్గొన్నారు.