
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేదా కాకా వెంకటస్వామి పేరు పెట్టాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం సంఘం ఆఫీసులో జరిగిన మీటింగ్లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేశ్ పాల్గొని మాట్లాడారు. ఈ విషయం సీఎంకు చేరేలా త్వరలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపడతామని ప్రకటించారు. మీటింగ్లో సంఘం లీడర్లు కొంకటి లక్ష్మణ్, మంథెన లింగయ్య, ఇరుగురాల కిష్టయ్య పాల్గొన్నారు.