ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ లో 6,928 మందికి సీట్లు 

ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ లో 6,928 మందికి సీట్లు 

హైదరాబాద్, వెలుగు: బీఈడీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 9,616 సీట్లు అందుబాటులో ఉండగా, 11,087 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. దీంట్లో 6,928 మందికి సీట్లు అలాట్ చేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్ బాబు తెలిపారు. ఫస్ట్ ఫేజ్​లో 9,817 మందికి సీట్లు అలాట్ అయితే, 4841 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్టు చేశారు. సెకండ్ ఫేజ్​లో సీట్లు అలాట్ అయిన విద్యార్థులు ఈ నెల 30లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని రమేశ్ బాబు సూచించారు.