రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన అల్లు అర్జున్

రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన అల్లు అర్జున్

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు(అక్టోబర్ 4) రాజేంద్రప్రసాద్‌ కూతురు గాయ‌త్రి (38) గుండెపోటు కారణంగా హఠాత్తుగా మృతి చెందారు. 

ఈ సంఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుటంబం శోకంలో మునిగిపోయింది. దీంతో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు మరియు సన్నిహితులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి  నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.దీంతో అల్లు అర్జున్ ని చూడగానే రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. 

Also Read :- బిగ్బాస్ వైల్డ్కార్డ్ ఎంట్రీస్ అప్డేట్ ఇచ్చిన నాగార్జున

ఈ క్రమంలో కూతురి మరణంతో దుఃఖంలో ఉన్న రాజేంద్రప్రసాద్ ని ఓదార్చుతూ ధైర్యం చెప్పాడు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్  రాజేంద్ర ప్రసాద్ పలు చిత్రాల్లో కలసి నటించారు. దీంతో వీరిద్దరిమధ్య మంచి అనుంబంధం ఏర్పడింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ తెలుగులో పుష్ప 2 చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తీకాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. దీంతో డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.