- అల్వాల్ పోలీసులను ఆశ్రయించిన బాలిక
- పోక్సో కేసు నమోదు.. బాధితురాలిని సఖి సెంటర్కు తరలింపు
అల్వాల్, వెలుగు: కూతురిని వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నించిన తల్లిపై అల్వాల్పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్వెంకటాపురంలో ఉంటున్న నగీన(40)కు 14 ఏండ్ల కూతురు ఉంది. భర్తతో మనస్పర్థలు రావడంతో నగీన కూతురుతో కలిసి ఉంటోంది. కాగా మూడు రోజుల కింద నగీన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది.
బుధవారం అల్వాల్పోలీస్స్టేషన్కు చేరుకుని తన తల్లిపై ఫిర్యాదు చేసింది. ‘నా తల్లి నన్ను వ్యభిచారం చేయమని ఫోర్స్చేస్తోంది. వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయాను. నాకు రక్షణ కల్పించండి.’ అని ఫిర్యాదులో పేర్కొంది. విషయం తెలుసుకున్న నగీన స్టేషన్కు వచ్చి తన కూతురిని అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆమెను అదుపులోకి తీసుకుని, పోక్సో యాక్ట్కింద కేసు ఫైల్చేసి రిమాండుకు తరలించారు. బాలికను సఖి సెంటర్ కు పంపారు.