చిరస్థాయిగా నిలిచే అమరన్ : నాగ్ అశ్విన్

చిరస్థాయిగా నిలిచే అమరన్ : నాగ్ అశ్విన్

శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం  ‘అమరన్‌‌’.  సోనీ పిక్చర్స్‌‌తో కలిసి కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు.  రాజ్‌‌కుమార్ పెరియసామి దర్శకుడు.  దీపావళి కానుకగా అక్టోబర్‌‌‌‌31న తెలుగు, తమిళ భాషల్లో  విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌‌‌‌పై సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్  మాట్లాడుతూ ‘ఇలాంటి రియల్ స్టోరీ తీసినప్పుడు బాలా బాధ్యత ఉంటుంది. ఈ కథ  ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది.  కమల్ హాసన్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం వెరీ గ్రేట్. ఇది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

శివ కార్తికేయన్ మాట్లాడుతూ ‘ఇదొక రియల్ హీరో స్టోరీ. మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకా ట్రూ స్టోరీ. అమరన్  ఒక సోల్జర్.. లవ్ డ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో డైరెక్టర్ రాజకుమార్ అద్భుతంగా చూపించారు. యాక్షన్‌‌తో పాటు లవ్ ఎమోషన్ కూడా ఉంటుంది’ అని చెప్పాడు.  అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం  గర్వంగా ఉందని సాయి పల్లవి చెప్పింది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుందని దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి అన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి, లిరిక్ రైటర్  రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.