
అమర్దీప్ చౌదరి హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఎంఎం నాయుడు దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. సాయిలీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ‘సుమతీ శతకం’ టైటిల్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటిస్తూ.. అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తం షాట్కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై మూవీ టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు. యూత్ఫుల్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. బండారు నాయుడు కథను అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.