అమర్‌నాథ్ కు వెళ్లి వస్తుండగా బస్సు బ్రేక్ ఫెయిల్.. తర్వాత ఏం జరిగిందంటే..?

అమర్‌నాథ్ కు వెళ్లి వస్తుండగా బస్సు బ్రేక్ ఫెయిల్.. తర్వాత ఏం జరిగిందంటే..?

జమ్మూకశ్మీర్ లోని జాతీయ రహాదారి 44పై అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు  పెను ప్రమాదం తప్పింది.  అమర్ నాథ్ దర్శనం తర్వాత తిరుగు ప్రయాణమైన బస్సుకు రాంబాన్ జిల్లా దగ్గర బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీన్ని గుర్తించిన డ్రైవర్  ప్రయాణీకులకు చెప్పడంతో..వారు అందులో నుంచి కిందకు దూకేశారు. ఘటనలో  10 మందికి గాయాలయ్యాయి.  

అదే సమయంలో అటు వైపు వెళ్తున్న సైనికులు వారిని కాపాడారు. టైర్ల కింద రాళ్లు వేసి బస్సును ఆపారు. రోడ్డు పక్కనే లోయ ఉండటంతో.. పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.