
హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్లో మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బహుళ అంచెల విధానం అమలు చేస్తున్నామని ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది. ప్రతి కొనుగోలు సురక్షితంగా ఉండేలా చూడటానికి అనేక టెక్నాలజీలను, కఠినమైన విధానాలను అవలంబిస్తున్నామని పేర్కొంది. ‘‘మోసపూరిత కార్యకలాపాలను ప్రారంభంలోనే గుర్తించడానికి లేటెస్ట్ అల్గారిథమ్లు, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం.
అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి ఈ వ్యవస్థలు నిరంతరం డేటాను పరిశీలిస్తాయి. ఉదాహరణకు, ఒకేసారి అనేక పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిగినా, షిప్పింగ్ అడ్రస్లు అసాధారణంగా ఉన్నా గుర్తిస్తాయి. మోసపూరిత వస్తువులను, నకిలీ వస్తువులను విక్రయించకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. కస్టమర్ మోసపోతే పరిహారం చెల్లిస్తున్నాం”అని అమెజాన్ ప్రకటించింది.