
న్యూఢిల్లీ:ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్అమెజాన్తన ఇండియా యూనిట్ ఐపీఓను ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇండియన్ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులతో చర్చలు జరుపుతోందని సమాచారం.
ఇవి ప్రాథమిక దశలోనే ఉన్నాయని అంటున్నారు. ఐపీఓకు వస్తే డేటాను స్థానికంగానే నిల్వ చేయవచ్చు. ఇండియాలోనే స్టాక్ను పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రూల్స్ ప్రకారం దేశీయ ఈ–కామర్స్ కంపెనీలు మాత్రమే ఇన్వెంటరీ బేస్మోడల్విధానంలో వ్యాపారం చేయాలి.
అంటే స్టాక్ను నిల్వ చేసి వేగంగా డెలివరీ చేయవచ్చు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఫారిన్ కంపెనీలు మార్కెట్ప్లేస్ మోడల్ను అనుసరించాలి. కేవలం సెల్లర్లకు, బయర్లకు మధ్య సమన్వయం చేయాలి. ఈ–కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కంటే అమెజాన్ కాస్త వెనకబడి ఉంది.