దికేవ్ పబ్ కేసులో దొరికిన అమెజాన్ సీనియర్ ఉద్యోగి 

దికేవ్ పబ్ కేసులో  దొరికిన అమెజాన్ సీనియర్ ఉద్యోగి 

సిటీలో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. మణికొండలోని కేవ్ క్లబ్ పై నార్కోటిక్ బ్యూరో అధికారులు, SOT పోలీసులు దాడులు చేశారు. క్లబ్ లో కొందరు వ్యక్తులు డ్రగ్స్ వాడుతున్నారని పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. అందులో ఉన్న 50 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా,24 మందికి పాజిటీవ్ గా తేలింది. రాయదుర్గం ఇన్స్ పెక్టర్ వెంకన్న. వీరితో పాటు పబ్ నిర్వాహకులు, డీజేలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 

డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడిన వారిలో పలువురు ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఫోటో గ్రాఫర్ మహేష్ చంద్ర, ప్రముఖ అకౌంటెంట్ ఆదన్ బారి, అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ MD షఫీ, అమెజాన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కిరణ్ బాగానీ, ఎవరెస్ట్ మసాలా వ్యాపార వేత్త మనీష్ గిరిధర్, అనిమేటర్ చింతం పూజిత్, మ్యూజిషియన్ అబ్దుల్లా అయాబ్, బిజినెస్ మెన్ రఫీ, అవంతి డిగ్రీ కాలేజీ విద్యార్థిని ప్రనీత్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ K.కిరణ్ కుమార్, TCS ఎంప్లాయ్ నారేడుమల్లి సందీప్, BFX ఆర్టిస్ట్ పోతురు వంశీ కృష్ణగా గుర్తించారు. ఇటు మరో బిజినెస్ మెన్ MD రాజా, DJ ఆపరేటర్ సందీప్ శర్మ, మధుసుధన్, అకౌంటెంట్ నవాజుద్దీన్, సివిల్ ఇంజనీరింగ్ రోహిత్ శర్మల పేర్లు బయటకొచ్చాయి.