
- ర్యాలీలో పాల్గొన్న డిగ్రీ, లా కాలేజీ స్టూడెంట్లు
ముషీరాబాద్, వెలుగు : బాగ్లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్అంబేద్కర్ డిగ్రీ, లా కాలేజీల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్, వన్టూ త్రీ నెహ్రూ యువ కేంద్రం నేతృత్వంలో గురువారం రోడ్సేఫ్టీపై అవగాహన కల్పించారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ట్రాఫిక్రూల్స్ పాటించాలని, హెల్మెట్ధరించాలని నినాదాలు చేశారు. డిగ్రీ, లా కాలేజీల డైరెక్టర్ విష్ణుప్రియ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ బండ్ల శ్రీధర్, వరలక్ష్మి, స్వప్న, కుమారస్వామి, లా కాలేజీ ప్రిన్సిపాల్ సృజన, స్టూడెంట్లు పాల్గొన్నారు.