అంబుజా సిమెంట్స్​సీఈఓ వినోద్​

అంబుజా సిమెంట్స్​సీఈఓ వినోద్​

న్యూఢిల్లీ: అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్​ వినోద్​బహెటీని సీఈఓగా నియమించింది. ప్రస్తుతం ఈయన సీఎఫ్​ఓగా పనిచేస్తున్నారు. అజయ్​ కపూర్​ను మేనేజింగ్​ డైరెక్టర్​గా అపాయింట్ ​చేసింది. వినోద్​ అడిషనల్ ​డైరెక్టర్​గానూ, హోల్​టైం డైరెక్టర్​గానూ మూడేళ్లపాటు పనిచేస్తారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది. 

చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​గా రాకేశ్ ​తివారీ వ్యవహరిస్తారు. ప్రవీణ్​ గార్గ్​ను ఇండిపెండెంట్​ డైరెక్టర్​గా నియమించింది. ఈయన కూడా మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. సీఈఓ, హోల్​టైం డైరెక్టర్​ బాధ్యతల నుంచి అజయ్ ​కపూర్​ను తొలగించింది. ఈ మార్పులన్నీ వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని అంబుజా సిమెంట్స్​ తెలిపింది.