
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్నగర్లో ఆదివారం బీజేపీ నిర్వహించనున్న వికాస సంకల్ప సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. స్థానిక ఎస్పీఎం గ్రౌండ్లో నిర్వహించే సభకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి మద్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కాగజ్నగర్కు చేరుకుంటారు. అక్కడి నంచి సభకు చేరుకొని ప్రసంగిస్తారు. అనంతరం నిజామాబాద్ సభకు వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఎస్పీ సురేశ్ కుమార్ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ పార్లమెంట్ ఇన్చార్జి అల్జాపుర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే హరీశ్ బాబు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.