
కోల్బెల్ట్, వెలుగు: భూ తగాదాలో ఓ పత్రికా విలేకరి ఇంట్లోకి వెళ్లి దాడికి యత్నించిన బీఆర్ఎస్కు చెందిన మందమర్రి వైస్ ఎంపీపీ లౌడం రాజ్కుమార్ అలియాస్ సదితో పాటు మరో ముగ్గురిపై మందమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వైస్ ఎంపీపీ లౌడం రాజ్కుమార్, విలేకరి కొమ్ము రాజేశ్ మధ్య భూ వివాదం ఉంది. దీనిపై మాట్లాడుకునేందుకు రావాలని రాజేశ్ కోరగా, సోమవారం పొద్దుపోయాక రాడ్ పట్టుకొని వైస్ ఎంపీపీ, అతని అనుచరులు ముగ్గురు రాజేశ్ఇంటికి వెళ్లారు. రాజేశ్ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరాను పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి దాడికి యత్నించారు. తనను చంపాలని ప్రయత్నించిన లౌడం రాజ్కుమార్, ఎండీ ముజాహిద్, పాలమాకుల భీంసేన్, మేసినేని అరుణ్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.