బెంగాల్​లో బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి

బెంగాల్​లో బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి

బెంగాల్ బీర్భూమ్ జిల్లాలో విషాదం 

కోల్​కతా: బెంగాల్​లో విషాదం చోటు చేసుకుంది. సోమవారం బీర్భూమ్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గంగారామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్​కు చెందిన బొగ్గు గని వద్దకు ట్రక్కులో డిటోనేటర్లను రవాణా చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 

రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ట్రక్కు నుంచి డిటోనేటర్లు అన్​లోడ్ చేయడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. పేలుడు సంభవించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తును ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు.