కన్నవాళ్లకు బారం కావద్దని గోదావరిలో దూకిన వృద్ధురాలు

కన్నవాళ్లకు బారం కావద్దని గోదావరిలో దూకిన వృద్ధురాలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన ఓ వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. కొత్తగూడెంలోని రామవరం కాలనీకి చెందిన భారతి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. తన పిల్లలను ఇబ్బంది పెట్టలేక చనిపోవాలని శుక్రవారం భద్రాచలంలోని గోదావరి స్నానఘట్టాల వద్దకు వచ్చింది. అనుమానం వచ్చిన కొందరు  భక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. 

దీంతో కానిస్టేబుల్స్ ​సురేంద్ర, జంపయ్య గోదావరి వద్దకు చేరుకునే సరికి ఆమె అప్పటికే నదిలోకి వెళ్లింది. వెంటనే వారు గోదావరిలోకి వెళ్లి ఆమెను బయటకు తీసుకువచ్చారు. తర్వాత పోలీస్​స్టేషన్​కు తరలించారు. అక్కడ కౌన్సిలింగ్​ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.