పద్మారావునగర్,వెలుగు: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ మెట్రోస్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని డెడ్ బాడీ లభ్యమైంది. ఎస్ఐ కిశోర్ వివరాల ప్రకారం..గాంధీ మెట్రోస్టేషన్ ఫిల్లర్ 1021 వద్ద దాదాపు 40 ఏండ్ల వయసున్న వ్యక్తి డెడ్ బాడీని గురువారం ఉదయం స్టేషన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులకు ఎలాంటి వివరాలు లభించలేదు. దీంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. 5.5 ఫీట్ల ఎత్తు, గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.