స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా.. ఉత్తర్వులు జారీ

స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆగస్టు 15, 2024న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్‌ మహీంద్రా ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో  తెలిపింది. 

రాష్ట్ర యువతకు స్కిల్స్ పెంచేందుకు రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల బేగరికంచిలో స్కిల్ యూనివర్సిటీ కోసం భవనానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. భవనం పూర్తయ్యేవరకు గచ్చిబౌలిలో స్కిల్ వర్సిటీ కార్యకలాపాలు నిర్వహిస్తారు.  

స్కిల్ యూనివర్సిటీలో మొత్తం 17 రకాల కోర్సులకు శిక్షణ , ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.  ఏటా లక్షమందికి శిక్షణ ఇచ్చేలా ఈ యూనివర్సిటీని విస్తరించనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్  ఇండియా భవనంలో స్కిల్ వర్సిటీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.