ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్, రాధిక పెళ్లి ముంబైలో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హంగూఅర్భాటాల నడుమ దేశవిదేశాలకు చెందిన వ్యాపారవాణిజ్య, సినీ, క్రీడారంగాల ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరు ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. ముకేశ్ అంబానీ రెండో కొడుకు అనంత్కు, వీరేన్–శైలా దంపతుల కూతురు రాధికా మర్చంట్తో గత డిసెంబరు 29న ఎంగేజ్మెంట్ జరిగింది.
ప్రీవెడ్డింగ్కోసం అంబానీ కుటుంబం 134 రోజులపాటు భారీ ఎత్తున సంప్రదాయ వేడుకలు నిర్వహించింది. బిల్గేట్స్, జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్, జాన్సెనా, కిమ్కర్దాషియాన్, గౌతమ్అదానీ, టోనీ బ్లేయిర్, రిహానా, మైక్టైసన్, డేవిడ్బెక్హామ్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కొన్ని మీడియా సంస్థల అంచనాల ప్రకారం పెళ్లి వేడుకల కోసం ముకేశ్ అంబానీ కుటుంబం రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేసింది.