న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు తమకు దక్కినట్లు లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) సోమవారం ప్రకటించింది. ఈ కాంట్రాక్టు విలువ ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
కానీ, కంపెనీ క్లాసిఫికేషన్ ప్రకారం ఆర్డరు విలువ రూ. 2,500 కోట్లు – రూ. 5 వేల కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. తొలి దశలో ఈ ఎయిర్పోర్టు 6 మిలియన్ పాసింజర్లను హ్యాండిల్ చేసే కెపాసిటీతో ఏర్పాటు కానుంది. ఆ తర్వాత ఈ కెపాసిటీని పెంచనున్నారు.