ఏపీలో కొత్త‌గా 6,242 పాజిటివ్ కేసులు న‌మోదు

ఏపీలో కొత్త‌గా 6,242 పాజిటివ్ కేసులు న‌మోదు

ఏపీలో గడిచిన 24గంటల్లో 6,242 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. 40మంది మృతిచెందిడంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,981గా ఉంది. ప్రస్తుతం 54,400 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6,58,875మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 7,084మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60,94,206 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇక కరోనా బారిన పడి కృష్ణా జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా అనంతపురం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లా, విజయనగరం జిల్లాలో ఒకరు చొప్పున చనిపోయారు.