ఏపీలో కొత్తగా 3,224 కేసులు..32 మంది మృతి

ఏపీలో కొత్తగా 3,224 కేసులు..32 మంది మృతి

అమరావతి : ఏపీలో 24 గంటల్లో కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.  కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 7,58,951కు చేరగా.. గత 24 గంటల్లో 5,504 మంది కరోనాను జయించారంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 32 మంది మృతి చెందారని.. ఏపీలో ఇప్పటి వరకూ 6,256 కరోనా మరణాలు సంభవించాయని చెప్పింది. ప్రస్తుతం ఏపీలో 43,983 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,08,712 మంది డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పటివరకు ఏపీలో 66.30 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు తెలిపింది ఏపీ ఆరోగ్యశాఖ.

జిల్లాల వారీగా కరోనా రిపోర్ట్