ఫోన్లో ఈ ఫీచర్ ఉంటే...మీ ఫోన్ పోయినా మీ డేటా సేఫ్..

ఫోన్లో ఈ ఫీచర్ ఉంటే...మీ ఫోన్ పోయినా  మీ డేటా సేఫ్..

సెల్​ఫోన్​.. మనందరి జీవితాల్లో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంపార్టెంట్​ ఫైల్స్ నుంచి లైఫ్ టైం మెమరీస్​ వరకు ఎన్నో అవసరమైన అంశాలు ఫోన్​లోనే ఉంటాయి. అలాంటప్పుడు పొరపాటున ఫోన్​ పోతే.. అందులో ఉన్న డేటా అంతా డేంజర్​లో పడ్డట్టే. అందుకే డేటాను సేఫ్​గా ఉంచుకోవడానికి గూగుల్ ఒక కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. అదే ఐడెంటిటీ చెక్​ ఫీచర్​. ఈ సెక్యూరిటీ ఫీచర్​తో ఫోన్​లోని డేటా సేఫ్​గా ఉంటుంది. దీంతో మీ ఫోన్​లో ఉన్న డేటా మీరు తప్ప ఎవరూ ఓపెన్ చేసే అవకాశమే ఉండదు. ఈ ఫీచర్​లో కొన్ని లొకేషన్లను యాడ్ చేసుకునే వీలుంది. అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో ఫోన్​ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా ఫింగర్ ప్రింట్​ లేదా ఫేస్ రికగ్నైజేషన్  ద్వారా  మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఫోన్ పిన్ వేరేవాళ్లకు తెలిసినా ఓపెన్ చేయలేరు. కాకపోతే ఈ ఫీచర్ అల్ట్రాసోనిక్, ఆప్టికల్ ఇన్​ డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, త్రీడీ ఫేస్ రికగ్నైజేషన్ ఉన్న డివైజ్​లకు మాత్రమే సపోర్ట్​ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్​15 బేస్డ్​ గూగుల్ పిక్సెల్ ఫోన్​లో పనిచేస్తుంది. 

ఎలా వాడాలంటే.. 

ఫోన్​ సెట్టింగ్స్​కు వెళ్లి, సెక్యూరిటీ &   ప్రైవసీ లేదా బయోమెట్రిక్ & పాస్​వర్డ్​ సెలక్షన్​పై క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి, ఐడెంటిటీ చెక్​ ఫీచర్​ని సెలక్ట్ చేయాలి. ఈ ఫీచర్​ని ఆన్​ చేయడానికి ముందు మీ మొబైల్​లో ఫింగర్ ప్రింట్​ లేదా ఫేస్ అన్​లాక్ బయోమెట్రిక్ సెట్ చేయాలి. తర్వాత లొకేషన్లను యాడ్ చేయాలి.