
మెదక్ టౌన్, వెలుగు: అంగన్ వాడీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సోమవారం కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ఏవోకు, ఐసీడీఎస్ జిల్లా డైరెక్టర్ బ్రహ్మాజీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి నర్సమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులకు డిసెంబర్, జనవరి నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల వారికి వేతనాలు చెల్లించి మెదక్ జిల్లాకు చెల్లించకపోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, జిల్లా నాయకులు మంజుల, సంతోష, ఫరీద, జయ, సుజాత, ప్రమీల, స్వప్న, లక్ష్మి పాల్గొన్నారు.