వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఐసీడీఎస్ సీడీపీవో వ్యక్తిగత దూషనలు చేస్తున్నారని, తోటి సిబ్బంది కేంద్రాలకు, కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి లేనిపోని మాటలు చెబుతున్నారంటూ అంగన్వాడీ టీచర్లు ధర్నాకు దిగారు. శనివారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
టీచర్లు మాట్లాడుతూ వెంకటాపురం సీడీపీవో ధనలక్ష్మి అంగన్వాడీ కేంద్రాల వద్దకు వచ్చి గ్రామస్తులు, పిల్లలు, ఆయాల సమక్షంలో అసభ్యకరమైన పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఆమె ప్రవర్తన వల్ల కుటుంబాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ములుగు కలెక్టర్ దివాకరకు కంప్లీట్ చేశారు. కార్యక్రమంలో వెంకటాపురం ప్రాజెక్ట్ మండలాల నుంచి సుమారు 60 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.