భూటాన్‌‌‌‌‌‌‌‌లోకి అనిల్​ అంబానీ గ్రూప్​

 భూటాన్‌‌‌‌‌‌‌‌లోకి అనిల్​ అంబానీ గ్రూప్​
  •  1,270 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటు 

న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ బుధవారం భూటాన్‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టింది. హిమాలయ దేశంలో 1,270 మెగావాట్ల సోలార్  జలవిద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. దీనికోసం భూటాన్  వాణిజ్య  పెట్టుబడి విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ లిమిటెడ్​తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.  

రిలయన్స్ గ్రూప్,  డ్రక్​లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ప్రత్యేకంగా సౌర  జలవిద్యుత్ కార్యక్రమాలపై దృష్టి పెడతాయి.  భూటాన్​లో  గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడుల కోసం అనిల్ ​అంబానీ గ్రూపు రిలయన్స్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది.  ఇది వచ్చే రెండేళ్లలో 250 మెగావాట్ల చొప్పున రెండు దశల్లో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది.