
యాదవులను రేవంత్ కించపరచలేదు
తలసాని కామెంట్లపై మాత్రమే స్పందించారు : అంజన్ కుమార్
కాంగ్రెస్ను చూసి బీఆర్ఎస్ భయపడుతున్నది : మల్లు రవి
గాంధీభవన్ జోలికొస్తే.. తెలంగాణ భవన్ను పేల్చేస్తం : అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు : పీసీసీ ప్రెసిడెంట్రేవంత్రెడ్డి యాదవులను కించపరచలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్చేసిన కామెంట్లకు రేవంత్ జవాబిచ్చారే తప్ప.. యాదవుల గురించి కామెంట్ చేయలేదని చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్యాదవే.. పీసీసీ చీఫ్ నుపిసికేస్తామంటూ కామెంట్లు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేరని, రాష్ట్రం కోసం తాము యుద్ధం చేశామని, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని ఆయన చెప్పారు.
ప్రియాంకా గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అనడం కేటీఆర్ దురహంకారానికి నిదర్శనమన్నారు. గాంధీభవన్ జోలికొస్తే ఖబడ్దార్అని హెచ్చరించారు. ప్రియాంకా గాంధీ సభ తర్వాత కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్నేతలు భయపడుతున్నారని పీసీసీ సీనియర్ వైస్ప్రెసిడెంట్మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్తో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నది పొలిటికల్ టూరిజమేనా అని ప్రశ్నించారు. తలసాని తలపొగరు మాటలకు రేవంత్ ఇచ్చిన రిప్లైని యాదవులకు అంటగట్టి కుల రాజకీయాలకు తెర లేపారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. తలసాని తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇక నుంచి తలసానిని తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అని పిలుస్తామని మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్అన్నారు.